12-11-2025 05:44:38 PM
భైంసా (విజయక్రాంతి): తాండూరు మండల కేంద్రంలో జూనియర్ కళాశాలతో పాటు ప్రభుత్వ పాఠశాలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో మౌలిక సదుపాయాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ పరీక్షలకు ఇప్పటినుండే విద్యార్థులను సన్నద్ధం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఉన్నారు.