సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా

29-04-2024 01:11:47 AM

మెదక్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఎన్నికల నియమావళిని జిల్లా యంత్రాంగం పటిష్టంగా అమలు చేస్తుందని మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా సైట్లపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఎన్నికల నియమావలి అమలులో ఉన్నందున పౌరులు బాధ్యతగా నడుచుకోవాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోషల్ మీడియా మానిటరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఎవరైనా ఇతర వ్యక్తులకు, రాజకీయ పార్టీలను ఉద్దేశించి సోషల్ మీడియా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రాం, ట్విట్టర్ మొదలైన వాటిలో అనుచిత పోస్టింగ్‌లు పెడితే అలాంటి వారిపై ఎలక్ట్రానిక్ డివైజ్‌లను సీజ్ చేసి చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.