21-05-2025 04:32:48 PM
సారంగాపూర్ (విజయక్రాంతి): మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. పలు గ్రామాలలో బుదవారం ఉదయం కురిసిన వర్షానికి వరి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో, ధాన్యం మరింత తడిసిపోయి నాణ్యతను కోల్పోయే అవకాశం ఉందని, తద్వారా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని లారీల కొరత కూలీల కొరత లేకుండ చూసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులకు వాతావరణం పట్ల ఎలాంటి నష్టం వాటిల్లకన్న ముందే ప్రభుత్వం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతున్నారు.