03-12-2025 06:02:57 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండి రామన్న దత్త సాయి ఆలయంలో దత్త జయంతి వేడుకలను పురస్కరించుకొని బుధవారం పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిబాబా భక్తులు పల్లకి సేవ మోస్తూ సాయినామ స్మరణ చేశారు. అలాగే కుంటాల మండలంలోని కల్లూరు సాయిబాబా ఆలయం ప్రారంభూర్ సాయి బాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో చైర్మన్ బురాజ్ భక్తులు లక్కడి జగన్మోహన్ రెడ్డి ఈవో భూమయ్య ధర్మకర్తలు ఉన్నారు.