26 May, 2026 | 5:56 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

యువతకు క్రీడా పోటీలు ఆదర్శనీయం

09-01-2026 12:00 AM
  1. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు  
  2. క్రీడా పోటీలకు ఆహ్వానం 
  3. సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి

గుమ్మడిదల, జనవరి 8: యువతకు క్రీడా పోటీలు నిర్వహించడం ఆదర్శనీయమని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రీడా పోటీలకు ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు మాజీ మంత్రి హరీశ్ రావును గురువారం కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ యువతలో ఆత్మవిశ్వాసం,జట్టు భావన, ఆరోగ్య స్ఫూర్తిని పెంపొందించడంలో క్రీడలకు ప్రాధాన్యం ఎంతో ముఖ్యమని  పేర్కొన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తిగా సిజిఆర్ ట్రస్ట్ యువత కోసం క్రీడా పోటీలను నిర్వహించడం ఆదర్శనీయమని అభినందించారు.

యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. 12వ తేదీ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు.కార్యక్రమంలో జిన్నారం వెంకటేష్ గౌడ్, కుమార్ గౌడ్, సంతోష్ రెడ్డి, ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.