12-05-2025 02:52:13 AM
కరీంనగర్, మే 11 (విజయ క్రాంతి): ఎప్ సెట్-2025 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు ప్రతిభ కనబరిచి ర్యాంకుల పంట పండించారు. గోకులకొండ వైష్ణవి 810, బి మనోఘ్న 968, బి సాత్విక్ 1142, పి స్ఫూర్తిశ్రీ 1527, బి శ్రావణి 1803, బి బ్లెస్సీ నుసన్ 2106, పి చందన 2165, పి భరత్ రెడ్డి 2815, పి అజితేష్ 3016, కె అనూహ్య 3503, వి ప్రవీణ్ 3623, డి రిషి 3996, జి అర్చన 4171, ఆర్ శ్రీయాన్ 4246, వి శివాణి 4570, బి స్రవంతి 4957వ ర్యాంకు సాధించినట్లు శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి తెలిపారు.
అలాగే 5 వేలలోపు 16 మంది, 10 వేలలోపు 51 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర రెడ్డి, డీన్ జగన్ మోహన్ రెడ్డి, ఏజీఎం శ్రీనివాస్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.