2 May, 2026 | 1:08 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

విత్తన దుకాణంలో స్టాక్ సీజ్

08-03-2026 12:10 AM

నాగిరెడ్డిపేట్, మార్చి 7 (విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనరసింహ ట్రేడర్స్ వ్యవసాయ విత్తనాల దుకాణల షాపు యజమాన్యం ఇటీవల అధిక ధరలకు యూరియా బస్తాలను విక్రయించారు. రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో ఎల్లారెడ్డి ఏడీఏ సుధా మాధురి, స్థానిక ఏవో సాయికిరణ్‌తో కలిసి శనివారం తనిఖీ చేశారు.

షాపులో ఉన్న పొటాష్, ఆర్గానిక్ పొటాష్ ఫర్టిలైజర్ స్టాక్ సీజ్ చేశారు. నిబంధనల ప్రకారం ఫర్టిలైజర్ దుకాణ యజమాన్యులు విత్తనాలను విక్రయించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.