calender_icon.png 7 June, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

06-06-2025 12:00:00 AM

భూభారతి సదస్సులు, ఫర్టిలైజర్ షాపుల్లో కలెక్టర్ రాజర్షి షా ఆకస్మిక తనిఖీలు

ఆదిలాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. జిల్లాలో గురువారం విస్తృతంగా పర్యటించి న కలెక్టర్ భూ భారతి రెవెన్యు సదస్సులను పరిశీలించారు. అదేవిధంగా విత్తన, షాపులు, ఎరువుల గోదాం లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అదిలాబాద్ రూరల్ మండలంలోని ఆర్లి (బి), చందా (టి) గ్రామాల్లోని విత్తనాల షాపును, ఎరువుల గోదాంలను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించి, విత్తనాల బ్యాగ్‌లపై ఉన్న లాట్ నంబర్ తదితర వాటిపై అరా తీశారు. అదేవిధంగా భూ భారతి రెవెన్యు సదస్సులో దరఖాస్తులు స్వీకరిస్తున్న తీరును పరిశీలించి, ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, గ్రామస్తులు దరఖాస్తులు ఏ సమస్యపై  పెట్టుకున్నారు, ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోడు చేస్తున్నది, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యం త ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతితో భూ సమస్యలు పరిష్కారానికి  రైతులకు సులభతరమైన విస్తృత సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన సదస్సులను జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సదస్సులో సమస్యలు ఉన్న రైతులు, ప్రజలు వినియోగించుకోవాలనీ సూచించారు.

రైతులకు నాణ్యమైన విత్తనా లు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవ డం జరిగిందనీ, నకిలీ  విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు పెట్టడం జరుగుతున్నదని స్పష్టం చేశారు. విత్తనాల సరఫరా, నాణ్యత, నియంత్రణ, ధరల పట్టికలు ఏర్పాటు చేయాలన్నా రు.కలెక్టర్ వెంట తహిసీల్దార్ గోవింద్,  మం డల వ్యవసాయ అధికారి శ్రీధర్ ఉన్నారు.