13-06-2025 10:04:47 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆయన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రిగా నియమితులైన అడ్లూరి లక్ష్మణ్ ను కలిసి పుష్పగుచ్చము, శాలువాతో సత్కరించారు. రాష్ట్ర మంత్రిగా నియమించబడినందుకు అభినందనలు తెలిపారు.