ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు
07-12-2024 11:45 PM
తహశీల్దార్ అద్దంకి నరేష్...
మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాక రెవిన్యూ గ్రామం గోపాలరావుపేట శివారులోని సర్వే నెంబర్ 128 విస్తీర్ణం 126.07 గుంటల భూమిని నవోదయ రెసిడెన్షియల్ స్కూలు కొరకు కేటాయించనైనదని తహశీల్దార్ అద్దంకి నరేష్ తెలిపారు. ఇటువంటి భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి, హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, సర్వేయర్ నరేష్ సిబ్బంది పాల్గొన్నారు.




