calender_icon.png 5 February, 2026 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో పుష్కరాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి

05-02-2026 04:31:43 PM

సమక్క సారలమ్మ జాతర, గోదావరి పుష్కరాల స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

మంథని,(విజయక్రాంతి)పుష్కరాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అంతర్గాం మండలంలోని గోలివాడ, రామగుండం, గోదావరిఖని సమ్మక్క సారలమ్మ టెంపుల్, రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ , మంథని గౌతమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ  గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర వద్ద రోజుకు 30 వేల భక్తులు వస్తారనే అంచనా తో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. గోదావరిఖని సమ్మక్క సారలమ్మ జాతర వద్ద 50 శాతం వరకు శాశ్వత పనులు పూర్తయ్యాయని, అక్కడ స్నానాల ఘాట, ఘాట్ నిర్మాణం పనులు ఉన్నాయని,స్థలం ఏర్పాటు మొదలగు పనులు రోజుకు లక్ష భక్తులు వచ్చిన తట్టుకునేలా చేపట్టాలన్నారు.

సుందిళ్ల గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద రోడ్ల మరమ్మత్తు పనులు, బ్యారెజీ వద్ద రోడ్డు డబుల్ లైన్ చేయాలన్నారు. మంథని గౌతమేశ్వర ఆలయం వద్ద గోదావరి పుష్కరాల సమయంలో రోజుకు రెండు లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని , ఇక్కడ సురబండేశ్వర్ స్వామి టెంపుల్ నుండి శివాలయం వరకు ఉన్న ఘాట్ వద్ద ఇన్ & ఔట్ ఏర్పాట్లు చేయాలని అన్నారు.  ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్డిఓ లు బి.గంగయ్య, సురేష్, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఇ.వై.టీం. తః రీ ఖాన్, జై దీప్,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.