30-05-2025 02:36:50 AM
ఖమ్మం, మే 29 (విజయ క్రాంతి): ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రాధాన్యక్రమంలో, పకడ్బందీగా అమ లు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇందిర మ్మ ఇండ్లు, భూభారతి, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులతో గురువారం ఖమ్మం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావే శానికి జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘు రాం రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలో తప్పా, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం చేయడం లేదన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేయడం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. రూ.22, 500 కోట్లతో 4.50 లక్షల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తోందని, లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారద్శకంగా జరగాలని సూచించారు.
నకిలీ విత్తనాలు అమ్మేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూభారతి చట్టంతో ప్రజలకు ఉన్న భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించాలి: మంత్రి కోమటిరెడ్డి
నకిలీ విత్తనాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా, పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు తెలిసేలా చేయాలని ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ర్యాండమ్గా చెక్ చేయాలని, అర్హులకు మాత్రమే ఇళ్లు చేరాలని మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రోసిడింగ్స్ మంజూరు చేయడంతో పాటు నిర్మాణ పనులు పురోగతిని కూడా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
సాదా బైనామాలకు పరిష్కారం: మంత్రి పొంగులేటి
అసైన్డ్ భూముల్లో పొజిషన్లో ఉన్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన ఉందని, వీటికి సంబంధించి ప్రతిపాదనలు ఉంటే సమర్పించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. సాదాబైనామాకు సంబంధించి ప్రభుత్వ భూములకు కూడా కొంతమంది దరఖాస్తులు చేసుకున్నారని ఆదేశించారు. హైకోర్టు నుంచి స్టే తొలగిన వెంటనే అర్హత ఉన్న సాదా బైనామాలను పరిష్కరిస్తామన్నారు.
ఎరువులను అందుబాటులో ఉంచాలి: మంత్రి తుమ్మల
ఎరువుల, విత్తనాల కొరత రాకుండా జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్టాక్ వివరాలను రెగ్యులర్గా మానిటర్ చేస్తూ, ప్రతీ మండలంలో అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువుల స్టాక్ అందుబాటులో ఉండాలని అన్నారు.