30-05-2025 02:54:29 AM
82,000 క్యూసెక్కులు దిగువకు విడుదల
గద్వాల, మే 29 (విజయక్రాంతి ): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాలకు వరద పోటెత్తింది. గురువారం సాయంత్రం అధికారులు జూరాల ప్రాజెక్టు నుంచి 10 గేట్లు ఎత్తి, 82,000 క్యూసెక్కుల వీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జూరాలకు 66 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా శుక్రవారం ఉదయం నాటికి లక్షకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.56 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 317.360 మీటర్లుగా ఉందని అధికారులు వెల్లడించారు. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన పెట్టంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.