3 July, 2026 | 11:35 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

ఈద్గాల వద్ద భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా అమలు చేయండి

31-03-2025 12:00 AM

-పోలీసు అధికారులతో టెలికాంట్స్‌లో మాట్లాడిన జిల్లా ఎస్పీ డి జానకి 

మహబూబ్ నగర్ మార్చి 30 (విజయ క్రాంతి) : రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈద్గాల వద్ద భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ డి జానకి పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి పోలీసు అధికారులతో టెలి కాన్ఫరెన్స్ లో రంజాన్ పండుగ ఏర్పాట్లపై మాట్లాడారు.

శాంతి భద్రతలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు.ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా పోలీసులు 24 గంటలపాటు విధుల్లో ఉండాలని చెప్పారు. సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ, క్యూఆర్టీ (క్విక్ రియాక్షన్ టీమ్స్), మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసినట్లు వివరించారు. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ డి జానకి తెలియజేశారు.