చాంబర్ ఆఫ్ కామర్స్కు సమ్మె నోటిస్
16-05-2025 12:00 AM
సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సత్రపల్లి సాంబశివరావు
మణుగూరు , మే 15 ః ఈనెల 20న తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో హమాలీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సాంబశివరావు కోరారు. ఈ మేరకు గురువారంహమాలి యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యం లో చాంబర్ ఆఫ్ కామర్స్ కు సమ్మె నోటీస్ అందజేశారు.
మణుగూరు ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిధిలో ఉన్నటువంటి అన్ని యూనియన్లు 20వ తారీకు స మ్మెకు సహకరించాలని కోరారు . సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ధీనివల్ల కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు ఉం టాయన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు బుర్ర సత్యనారాయణ. రమేష్ అంజి తదితరులు పాల్గొన్నారు.






