31 March, 2026 | 1:57 AM

విద్యుత్ సంస్థలో సమ్మె సైరన్

31-03-2026 12:13 AM

బడంగ్‌పేట్, మార్చి 30 (విజయక్రాంతి) : విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీ.వీ.ఏ.ఈ. జేఏసీ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె సైరన్ మోగింది.

సోమవారం సరూర్ నగర్ డివిజన్ కార్యాలయం ఎదుట రాష్ట్ర విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమములో ఆర్టిజియన్స్ మీటర్ రీడర్స్, బిల్ కలెక్టర్స్ శ్రీకాంత్ రెడ్డి, ఉపేందర్, పెద్దులు, శ్రావణ్ కుమార్, జయసుధన్, ఉదయ కిరణ్,రాజిరెడ్డి, ప్రకాష్ చారి, నగేష్, మీన చారి, తదితరులు పాల్గొన్నారు.