calender_icon.png 19 June, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతర విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు

19-06-2025 12:40:21 AM

  1. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

1912 కు ఫోన్ చేస్తే విద్యుత్ సమస్య పరిష్కారం

20 వేల మెగా వాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా చర్యలు

విద్యుత్ అంబులెన్స్‌ల ఆవిష్కరణ, ఉద్యోగుల హెల్త్ క్యాంపును ప్రారంభించిన భట్టి 

ఖమ్మం, జూన్ 18 (విజయ క్రాంతి):రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన ని రంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సి. ఎం. భట్టి విక్రమార్క మల్లు అన్నారు.బుధవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు, ఖ మ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, టీ.జి. ఎన్.పి.డి. సి.ఎల్. సిఎండి కె. వరుణ్ రెడ్డి లతో కలిసి విద్యుత్ అంబులెన్స్ లను ఆవిష్కరించి, విద్యుత్ ఉద్యోగుల హెల్త్ క్యాంపును ప్రారంభించారు .

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడు తూ వరదల సమయంలో ఎవరు ఊహించ ని వేగంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేసిన సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వి ద్యుత్ శాఖలో పారదర్శకత తీసుకొని వచ్చిందని, విద్యుత్ కార్మికుల సమస్యల పరి ష్కారానికి ఎప్పటికప్పుడు సమయం కేటాయిస్తామని అన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి విద్యుత్ సరఫరా చాలా కీలకమని, మన దగ్గర నిరంతరాయ విద్యుత్ సరఫరా అన్ని వర్గాలకు అందించేందుకు పకడ్బందీ చర్య లు చేపట్టామని, సాంకేతిక సమస్యలు, వా తావరణ పరిస్థితుల వల్ల విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడినప్పుడు మరమ్మత్తు పనులు చేసే సమయంలో కార్మికులకు ప్రమాదాలు జరగకుండా తప్పని సరిగా భద్రతా చర్యలు పాటించాలని అన్నారు.

ఈ సందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సా మాన్యుల జీవన ప్రమాణాలు పెరిగేందుకు విద్యుత్ శాఖ పని తీరు కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీ.జి. ఎన్.పి.డి. సి.ఎల్. సిఎండి కె. వరుణ్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్.ఈ. ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ప్రజా ప్రతినిధు లు, విద్యుత్ శాఖ సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.