calender_icon.png 19 June, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యం

19-06-2025 12:39:42 AM

- ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

- వావిలాలలో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

- గుమ్మడిదలలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం

- పోచారం జర్నలిస్టు కాలనీలో సీసీ రోడ్లు, యూజీడీ పనులకు శంకుస్థాపన

పటాన్ చెరు, జూన్ 18 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి  మరింత ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిన్నారం మండలం వావిలాల గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఎమ్మెల్సీ అంజిరె డ్డితో కలిసి ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు  చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు.  గత దశాబ్ది కాలంలో ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, ఇంచార్జి ఎంఈవో కుమారస్వామి, ఎంపీవో రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ లు ఎం.రవీందర్, ఎంపీ అశోక్,  నాయకులు నవనీత్ రెడ్డి, సురేందర్ రెడ్డి, కరుణాకర్ గౌడ్, పాల్గొన్నారు.

అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో అందరు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కేంద్రం గుమ్మడిదలలో హానర్ ల్యాబ్స్ పరిశ్రమ సహకారంతో రూ.15.50లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి బుధ వారం ప్రారంభించారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం జీఎంఆర్ జర్నలిస్ట్ మోడల్ కాలనీలో రూ.50లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

అనంతరం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ హరివిల్లు కాలనీలో హనుమాన్ దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అందరూ దైవభక్తిని అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాలలో తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, డీఈ సత్యనారాయణ, ఏఈ మౌనిక, నాయకులు అంతిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, బండి శంకర్, ఈర్ల శ్రీకాంత్, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు కాలనీ వాసులుపాల్గొన్నారు.