17 April, 2026 | 10:08 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

హాస్టల్ పైనుంచి దూకి విద్యార్థిని మృతి

28-06-2025 12:00 AM

మంచిర్యాల, జూన్ 27 (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణం లోని సాంఘీక సం క్షేమ మహిళా డిగ్రీ కళాశాల బీఎస్సీ బీజడ్సీ విద్యార్థిని హైదరాబాద్‌లో వైద్యం పొందు తూ శుక్ర వారం మృతి చెందింది.  వివరాల్లోకి వెళితే... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మార్తిడ్ గ్రామానికి చెందిన స్వప్న (19) మంచిర్యాల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతుంది.

మంగళవారం అర్ధరాత్రి హాస్టల్ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడగా హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యం పొందుతూ శుక్రవారం ఉద యం మూడు గంటల ప్రాంతంలో స్వప్న మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరా లేదు.

స్వప్న మృతి చెందిన విష యం తెలుసుకున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన బీఆ ర్‌ఎస్ నాయకులు, విద్యార్థి సం ఘాల నాయకులు శుక్రవారం మధ్యాహ్నం మంచిర్యాల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ముందు ఆందోళన నిర్వహించారు.

స్వప్న కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతికి కారకులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. పోలీసులు కళాశాల వద్దకు చేరుకొని ఆందోళనను విరమింపజేశారు.