26 June, 2026 | 6:47 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి... విద్యార్థి సంఘాల ధర్నా

31-07-2025 06:16 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాల ముందు గురువారం విద్యార్థి సంఘాలు అనుమతులు లేని పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేయాలని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పిడిఎస్యు (ఎస్ )జిల్లా అధ్యక్షులు ఎన్. బాల్ రాజ్ మాట్లాడుతూ విద్యాశాఖ నుండి  అనుమతులు పొందకుండా బాన్సువాడ పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల నడిపిస్తుండడంతో గత కొద్దిరోజుల క్రితం విద్యార్థి సంఘాల నాయకులు ఈ విషయంపై వివరాలు అడగగా కోర్టు కేసులో ఉందని చెబుతూ మభ్యపెడుతూ వచ్చారని, గురువారం విద్యార్థి సంఘాల తరుపున పాఠశాలకి వెళ్లి ధర్నా చేయడం జరిగింది.

ఇదే సందర్భంలో పాఠశాల ఇంచార్జ్నీ  ప్రశ్నించగా ఇది శ్రీచైతన్య పాఠశాల కాదు కేవలం ట్యూషన్ సెంటర్ అని అర్ధరాహితమైన సమాధానాలు ఇస్తున్నారనీ, కావున ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా నడుస్తున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలను తక్షణమే విద్యాశాఖ అధికారులు సీజ్ చేయవలసిందిగా ఎంఈఓ డీఈఓ గారిని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ గతంలో చేయడం జరుగుతుందనీ, మళ్లీ ఒక్కసారి బ్యాన్స్వాడాలో విద్యార్థులను, తల్లిదండ్రులను విద్యాసంస్థ యజమానులు మరోసారి మోసం చేసే ప్రయత్నంచేస్తున్నారనీ,

ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలకు పూనుకొని పాఠశాలలను ముసివేయనీ పక్షంలో ఎలాంటి అనుమతులు లేని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంతో విద్యాశాఖ అధికారులు కుమ్మక్కయ్యారని అనుకోవాల్సి పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా వారున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఒక్క సంవత్సర కాలం భవిష్యత్ వ్యర్థం అవుతుందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థి సంఘలు విద్యాశాఖ అధికారుల కార్యాలయాలను ముట్టడి చేయవలసి ఉంటుందని, ఈ సందర్బంగా హెచ్చరించారు.