23-04-2025 08:02:34 PM
కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): రాష్ట్రస్థాయిలో సత్తాచాటిన శ్రీ ఆర్యభట్ట వోకేషనల్ కాలేజ్(Sri Aryabhatta Vocational Junior College) విద్యార్థులు 2024-2025 విద్య సంవత్సరంలో ఫిజియోథెరపీ విభాగంలో కోర్సు ప్రారంభించిన మొదటి సంవత్సరంలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో సత్తా చాటారు. కళాశాలకు చెందిన త్సానిమ్ ఫాతిమా 469/500 మార్కులతో ఫిజియోథెరపీ కోర్సులో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు, అదే కళాశాలకు చెందిన విద్యార్థినీ సిరిగాద ప్రవళిక 456/500 మార్కులతో ఫిజియోథెరపీ కోర్సులో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి ప్రభంజనం సృష్టించారు.
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ విభాగంలో బి మమత, సాత్విక్ గౌడ్, ఎలక్ట్రిషన్ విభాగంలో శ్యామల్, సిహెచరేవంత్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ విభాగంలో సానియాజ్, కల్పన్, రిమిష ఫాతిమా రాష్ట్రస్థాయిలో మొదటి పది ర్యాంకులలో దాదాపు 5 ర్యాంకులు శ్రీ ఆర్యభట్ట ఒకేషనల్ కళాశాల విద్యార్థులు ఊహించని ప్రభంజనాన్ని సృష్టించారనీ కళాశాల యాజమాన్యం తెలిపారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కేశరెడ్డి గురువేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ హనుమంతరావు, కళాశాల డైరెక్టర్ సత్యనారాయణ, కళాశాల అధ్యాపక బృందం జావిద్, సయ్యద్, బాబర్, విష్ణు, శ్రీనివాస్, పాల్గొన్నారు.