11 July, 2026 | 2:08 PM

Breaking News

మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •   డంపింగ్ యార్డ్ తరలింపు వ్యతిరేక ఉద్యమాన్ని ఆపలేరు: ఎంపీ ఈటెల రాజేందర్   •  

ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలి

14-05-2026 04:32 PM

సర్పంచ్ కలకోట్ల శైలేందర్ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే14:ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను తల్లిదండ్రులు చేర్పించాలని సర్పంచ్ కలకోట్ల శైలేందర్ అన్నారు.గురువారం మండలంలోని అడివెంల గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటి ప్రచార నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు.ఉచిత పాఠ్యపుస్తకాలు,నాణ్యమైన మధ్యాహ్న భోజనం,యూనిఫామ్ లను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వజ్జె చిన్నరవి,హెచ్ఎం యాదమ్మ,ఉపాధ్యాయులు విజయలక్ష్మి,కరుణ,వార్డు సభ్యులు రవి,విద్యార్థులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.