calender_icon.png 23 January, 2026 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు బాధ్యతలను మరచిపోవద్దు

23-01-2026 12:13:42 AM

కెఎల్‌హెచ్ యూనివర్సిటీ బాచుపల్లి క్యాంపస్‌లో దిశా నిర్దేశం చేసిన మంత్రి వివేక్

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): విద్యార్థులు తమ లక్ష్య సాధన చేరు కునేంత వరకూ బాధ్యతలు మరచిపోవద్దని కార్మిక శాఖ మంత్రి వివేక్.. కేఎల్‌హెచ్ యూ నివర్సిటీ బాచ్‌పల్లి క్యాంపస్‌లో విద్యార్థులకు మంత్రి వివేక్ దిశా నిర్దేశం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. క్రమశిక్షణ, బాధ్యత, ప్రణాళిక వంటి అంశాలపై సోదాహరణంగా విశ్లేషంచారు. కళా శాల, యూనివర్సిటీలలో నేర్చుకునే విద్య అత్యంత విలువైనదని విద్యార్థులను అత్యున్నత శిఖరాలకు తీసుకు వెళ్తుందని చెప్పారు.

తల్లి తండ్రుల ఆశయాలను నిర్లక్ష్యం చేయవద్దని వారు ఎన్నో కష్టాలు పడి తమ పిల్లల కోసం చేసే త్యాగాలను గుర్తించాలని హితవు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రం గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి అమలు చేస్తోందని చెప్పారు. మెరిట్ విద్యార్థుల కోసం కె ఎల్ యూనివర్సిటీ అమలుచేస్తున్న స్కాలర్షిప్ విధానం చాలా బావుందని ప్రశంసించారు. కె ఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో ర్యాంకు లు పొందిన విద్యార్థులకు మెమెంటోలను, మెడల్ను అందించారు.

మెరిట్ విద్యార్థులకు ఏటా అందిస్తున్న 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్ పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు. కె ఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతోనే ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల ఎ జి ఎం రవికుమార్, కె ఎల్ హెచ్ బాచ్ పల్లి క్యాంపస్ ప్రిన్సిపాల్ రవికుమార్, గ్లోబల్ బిజినెస్ స్కూల్ డీన్ డాక్టర్ ఆనంద్, యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి రాజేష్, జోనల్ హెడ్ రాజ్యలక్ష్మి, యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్ ఎస్ ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.