27 July, 2026 | 6:31 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

బడిలో పాముల సంచారం

23-01-2026 12:13 AM

భయం గుప్పిట్లో విద్యార్థులు

చారకొండ, జనవరి 22: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే సరస్వతి నిలయాలు సమ స్యలతో సతమతమవుతున్నాయి. పాఠశాలలకు సరైన రక్షణ లేకపోవడంతో విద్యార్థులు భయం నీడలో తమ చదువులు సాగిస్తున్నారు. గురువారం మండలంలోని రామ చంద్రాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదిలోకి పాము రావడం తో విద్యార్థులు భయాందోళనకు గురయ్యా రు. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో పామును చంపి వేశారు.

పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పాటు పరిసరాల చుట్టూ ఏపుగా పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా మారడంతో పాఠశాల ఆవరణలోనే విష కీటకాలు, పాములు సంచరిస్తుండటంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపు తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలకు ప్రహారీ నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.