12 June, 2026 | 4:22 PM

Breaking News

విద్యార్థులకు పోషకాలు, నాణ్యతతో కూడిన ఆహారం మధ్యాహ్న భోజనంలో వడ్డించాలి   •   డ్రగ్స్ వద్దు- జీవితం ముద్దు   •   రేవంత్ సర్కార్ రైతు డిస్కమ్ పెట్టిందే ప్రైవేటీకరణ కోసం   •   విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి   •   రిమ్మా గ్రామాన్ని సందర్శించనున్న రెండవ మంత్రి   •   పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోంది   •   దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే.. ఊరుకోం: కేటీఆర్   •   టీయూవీ జిల్లా ఉపాధ్యక్షుడిగా జోగు అశోక్ కుమార్ నియామకం   •   శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో మహిళల ప్రత్యేక పూజలు   •   ఉప్పల్‌ భాగయత్ లోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం   •  

బడిలో పాముల సంచారం

23-01-2026 12:13 AM

భయం గుప్పిట్లో విద్యార్థులు

చారకొండ, జనవరి 22: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే సరస్వతి నిలయాలు సమ స్యలతో సతమతమవుతున్నాయి. పాఠశాలలకు సరైన రక్షణ లేకపోవడంతో విద్యార్థులు భయం నీడలో తమ చదువులు సాగిస్తున్నారు. గురువారం మండలంలోని రామ చంద్రాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదిలోకి పాము రావడం తో విద్యార్థులు భయాందోళనకు గురయ్యా రు. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో పామును చంపి వేశారు.

పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పాటు పరిసరాల చుట్టూ ఏపుగా పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా మారడంతో పాఠశాల ఆవరణలోనే విష కీటకాలు, పాములు సంచరిస్తుండటంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపు తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలకు ప్రహారీ నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.