23-08-2025 12:51:25 AM
చివ్వెంల, ఆగస్టు 22: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, భవిత కేంద్రం, తాసీల్దార్ కార్యాలయం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని, సెప్టెంబర్ ఒకటో తారీకు నుండి అదనపు తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థులు మంచిగా చదవడం, రాయటం ప్రాక్టీస్ చెసి మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరారు.
తదుపరి భవిత కేంద్రం సందర్శించి సైగలతో అంకెలు,కలర్స్ మ్యాచింగ్ లను విద్యార్థులతో చేపించారు.తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా సోని అనే లబ్దిదారు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే వారికి ఇసుక ఉచితంగా అందజేయాలని తహసీల్దార్ ని ఆదేశించారు. తదుపరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాఫ్ హాజరు, ఎ యన్ సి రిజిస్టర్ లను పరిశీలించారు.
ఈ డి డి వివరాలు, ఇప్పటి వరకు ఈ నెలలో ఎన్ని ప్రసవాలు జరిగాయని డాక్టర్ భవానిని అడిగారు. ఈ డి డి క్యాలెండర్ ను పీహెచ్సీలో అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలని, ఆశా కార్యకర్తల ద్వారా ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవాలు అయ్యే విధంగా చూడాలని అన్నారు.
తహసీల్దార్ ప్రకాష్, ఎంపిడిఓ సంతోష్ కుమార్, మెడికల్ అధికారి భవాని,ఆయుష్ డాక్టర్ పార్థసారధి,ప్రధానోపాధ్యాయురాలు కళారాణి, భవిత కేంద్రం ఇంచార్జి పద్మ,ఉపాధ్యాయులు, అధికారులు,స్టాఫ్ నర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.