3 July, 2026 | 11:50 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

విద్యార్థినులు లక్ష్యంతో చదవాలి

28-03-2025 12:00 AM

నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ, మార్చి 27 (విజయక్రాంతి)  :  విద్యార్థినులు లక్ష్యంతో చదవి భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదగాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నల్లగొండలోని పూర్వపు ఎస్‌ఆర్టీసీఈ ఆవరణలో నిర్వహిస్తున్న నిడమనూరు తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను గురువారం ఆమె తనిఖీ చేశారు.

పలు సబ్జెక్టులపై ప్రశ్నలడిగి విద్యార్థినుల అభ్యసనా సామర్థ్యాలు పరీక్షించారు. చురుకుగా సమాధానాలు చెప్పిన వారికి చాక్లెట్లు పంపిణీ చేశారు. ఎండాకాలంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని, జంక్ ఫుడ్  తినొద్దని చెప్పారు. పదో తరగతి విద్యార్థినులు పరీక్షలు బాగా రాయాలన్నారు.