28-06-2025 12:00:00 AM
కరీంనగర్,జూన్ 27)వియాక్రాంతి): పలు అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సప్తగిరి కాలనిలోని కోదండ రామాలయం పక్కన సప్తగిరి కాలని కమ్యూనిటీ భవన నిర్మాణానికి పది లక్షలు కేటాయించి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. కిసాన్ నగర్ లోని క్రిస్టియన్ స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణానికి పది లక్షలు మం జూరు చేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక నాయకుల మరియు ప్రజల కోరిక మేరకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి ప నులు చేపడుతున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు కొనసాగుతోందని రాబోయే రోజుల్లో ఇంకా నిధులు వెచ్చించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి,దిండిగాల మహే ష్,తుమ్మల రమేష్ రెడ్డి,గౌతమ్ రావు,రామయ్య, కేశవరెడ్డి,రాజిరెడ్డి తదితరులుపాల్గొన్నారు.