24 June, 2026 | 12:21 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు మద్దతు ఇవ్వండి

09-02-2026 01:54 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం పిలుపు

ముషీరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను గెలిపించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం పిలుపునిచ్చారు. ఓటు మనదే  సీటు మనదే, బీసీల ఓటు బీసీలకే అనే నినాదంతో బీసీ ఓటర్లు ఐక్యం గా ముందుకు రావాలని ఆయన సూచించారు.

ఈ మేరకు ఆదివారం హైదరాబా ద్లోని బీసీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో గుజ్జ సత్యం మాట్లాడుతూ  రాష్ట్రంలోని 116 ము న్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో జరుగుతున్న ఎన్నికలను బీసీల రాజకీయ ఐక్యతను ప్రదర్శించే వేదికగా మార్చుకోవాలని కోరారు.

జనరల్ స్థానాలు ఏకపక్షంగా కొన్ని వర్గాలకు మాత్రమే కేటాయించినవి కాదని, రిజర్వేషన్లు లేని చోట పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం ద్వారా రాజకీయంగా న్యాయం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఐక్యంగా బీసీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడి యా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సౌత్ ఇండియా సెక్రటరీ సూర్యనారాయణ, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు జెల్ల నరేందర్, మరపంగు వెంకన్న, కర్నాటి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.