23 June, 2026 | 11:06 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

42వ డివిజన్‌లో మాజీ మేయర్ వై.సునీల్‌రావు విస్తృత ప్రచారం

09-02-2026 01:56 AM

ముకరంపుర, ఫిబ్రవరి 8 (విజయ క్రాంతి): మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 42 వ డివిజన్ నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మేయర్, బీజేపీ నాయకులు యాదగిరి సునీల్ రావు డివిజన్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. గడపగడపకు వెళ్లి భారతీయ జనతా పార్టీ నీ గెలిపించాలని ఓటర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పార్టీ కూడా కరీంనగర్ నగర అభివృద్ధికి నిధులు తీసుకువచ్చే పరిస్థితి లేదని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే కేంద్ర నుండి వరదలా నిధులు వచ్చి నగరం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తున్నదని భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని సునీల్ రావు పేర్కొన్నారు.