7 May, 2026 | 3:12 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

చేవెళ్ల పీఏసీఎస్ అభివృద్ధికి సహకారం

30-06-2025 02:06 AM

డీసీసీబీ చైర్మన్ కొత్త కురువ సత్తయ్య

చేవెళ్ల, జూన్ 29:చేవెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి తన వంతుగా సహకారాన్ని అందిస్తానని డీసీసీబీ చైర్మన్ కొత్త కురువ సత్తయ్య తెలిపారు. ఆదివారం సొసైటీ కార్యాలయాన్ని సందర్శించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరికీ సకాలంలో సేవలు అందించాలని సొసైటీ సిబ్బందికి సూచించారు. రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించేలా చూడాలని కోరారు.

చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి తన సొంత నిధులతో సొసైటీ భవనాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రవి గౌడ్, గుండాల సహకార సంఘం చైర్మన్ నక్క బుచ్చిరెడ్డి, చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్లు పైండ్ల మధుసూదన్ రెడ్డి, నరసింహులు, ఎజీఎం ప్రభాకర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.