30-06-2025 02:06:17 AM
డీసీసీబీ చైర్మన్ కొత్త కురువ సత్తయ్య
చేవెళ్ల, జూన్ 29:చేవెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి తన వంతుగా సహకారాన్ని అందిస్తానని డీసీసీబీ చైర్మన్ కొత్త కురువ సత్తయ్య తెలిపారు. ఆదివారం సొసైటీ కార్యాలయాన్ని సందర్శించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరికీ సకాలంలో సేవలు అందించాలని సొసైటీ సిబ్బందికి సూచించారు. రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించేలా చూడాలని కోరారు.
చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి తన సొంత నిధులతో సొసైటీ భవనాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రవి గౌడ్, గుండాల సహకార సంఘం చైర్మన్ నక్క బుచ్చిరెడ్డి, చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్లు పైండ్ల మధుసూదన్ రెడ్డి, నరసింహులు, ఎజీఎం ప్రభాకర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.