9 April, 2026 | 9:11 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు

29-08-2025 01:55 PM

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ జాబితా నుంచి మూడు వర్గాలను తొలగించాలన్న పిటిషన్ పై సుప్రీం కోర్టులో(Supreme Court) శుక్రవారం నాడు విచారణ జరిగింది. లంబాడా, సుగాలి, బంజారాను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖాలైంది. మూడు వర్గాలు ఎస్టీ జాబితాలో కొనసాగించాల్సిన అవసరం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 3 వర్గాలను కొనసాగించాల్సిన అవసరం లేదని తెల్లం వెంకట్రావు(Tellam Venkata Rao) పిటిషన్ వేశారు. లంబాడా, సుగాలి, బంజారా వారు బీసీ జాబితాకు చెందిన వారని పిటిషన్ లో తెలిపారు. విభజనకు ముందు పరిస్థితులు వేరని పిటిషన్ లో తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. 1976 వరకు మూడు వర్గాలను ఎస్టీల జాబితాలో పరిగణించలేదని వెంకట్రావు సూచించారు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ల ధర్మాసనం  పిటిషన్ పై  విచారణ జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.