calender_icon.png 7 September, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాజేడు,వెంకటాపురం మండలాలలో మీసేవ సెంటర్ల ఆకస్మిక తనిఖీలు

04-09-2025 01:45:30 AM

-నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు 

-అతి త్వరలో నూతన 

-ఆధార్ సేవకేంద్రాల ఏర్పాటుః ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్

వాజేడు, వెంకటీపురం, సెప్టెంబరు 3 (విజయక్రాంతి): వాజేడు వెంకటాపురం (నూగూరు) మండలాల్లో జగన్నాధపురం, పేరూరు ,వాజేడు, ఆలుబాకా, పాత్రపురం, మోర్రివా గూడెం మీసేవ కేంద్రాలను ఈ - డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మీసేవ కేంద్రాలను ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉండి ఈసేవ గైడ్లైన్స్ ప్రకారం మీ సేవ కేంద్రాన్ని నడపవలనని సూచించారు.ఆపరేటర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అన్ని రకాల మీసేవ, భూభారతి మరియు మిగతా ఆన్లైన్ సర్వీస్ లను ప్రజలకు అందించాలని సూచించారు.

మీసేవ సెంటర్లో తప్పకుండా సిటిజెన్ చాప్టర్,భూభారతికి సంబంధించిన ఫ్లెక్సీలు, మీసేవ లోగో, మరియు తాహాసిల్దార్, ఈడీఎం, పరిష్కారం కాల్ సెంటర్ల యొక్క ఫోన్ నెంబర్లు తప్పనిసరిగా ఉండవలెనని ఆదేశించారు. వాజేడు మరియు వెంకటాపురం మండల ప్రజలు ఆధార్ సేవల గురించి ఇబ్బందులు పడుతున్న విషయం గుర్తించి అదనపు కొత్త ఆధార్ సెంటర్ ని  మండల కేంద్రంలలో అతి త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు కళ్యాణ లక్ష్మి భర్త మరియు డెత్ సర్టిఫికెట్లు ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని మరియు మీసేవ ఆపరేటర్లు ప్రజల పట్ల సున్నితంగా ఉంటూ వారికి మీసేవ సర్వీసులను మరియు ఇతర అన్ని రకాల ఆన్లైన్ సేవలను అందించాలని ఆదేశించారు నిర్ణీత రుసుము కంటే ఎక్కువ రుసుము దరఖాస్తుదారుడు నుంచి తీసుకున్నట్లయితే తప్పనిసరిగా అట్టి మీసేవ సెంటర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.