వ్యవసాయ బావి వద్ద యువకుడి అనుమానాస్పద మృతి
23-03-2026 12:03 PM
నంగునూరు, (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మైసంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన బాదరబోయిన శేఖర్ అనే యువకుడు తన వ్యవసాయ బావి వద్ద సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.బావి సమీపంలో శేఖర్ నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శేఖర్ ఆదివారం ఉదయం నుంచే కనిపించడం లేదని,గాలించగా సోమవారం ఉదయం వ్యవసాయ బావు వద్ద మొక్క జొన్న చేనులో శవం మై తేలి ఉన్నాడు.శేఖర్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.




