భూసార పరీక్షలతో సుస్థిర సాగు: శాస్త్రవేత్త
27-05-2026 12:00 AM
మఠంపల్లి మే 26: మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమంలో కేవీకే-గడ్డిపల్లి మృత్తిక శాస్త్రవేత్త అరిగెల కిరణ్ రైతులకు భూసార పరీక్షల ప్రాధాన్యాన్ని వివరించారు. భూమి సారాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా ఎరువులు వాడితే ఖర్చులు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. రైతులు మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్,ఏఇఓ లు శ్రావ్యాంజలి, త్రివేణి రైతులు తదితరులు పాల్గొన్నారు






