04-06-2025 06:53:49 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): సిపిఐ అనుబంధ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మానుకోట మండల అధ్యక్షుడిగా గురుస్వామి, ప్రధాన కార్యదర్శిగా కొమ్ము నారాయణ ఎన్నికయ్యారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభలో మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ... వ్యవసాయ కార్మికుల హక్కుల సాధన కోసం వారి పక్షాన నిరంతరం ఉద్యమిస్తామని తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చింతకుంట్ల వెంకన్న, సిపిఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారిధి, నియోజకవర్గ కార్యదర్శి బి. అజయ్ సారధి రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తండా సందీప్ కు కృతజ్ఞతలు తెలిపారు.