04-06-2025 07:06:56 PM
స్మశాన వాటిక నిర్మాణానికి స్వంత ఖర్చుతో శ్రీకారం..
హుజురాబాద్ (విజయక్రాంతి): హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు(Congress party in-charge Vodithala Pranav Babu) తుమ్మనపల్లి గ్రామ ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో చాలా కాలంగా స్మశానవాటిక లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రణవ్ బాబు స్వయంగా రంగంలోకి దిగారు. తాజాగా గ్రామస్థులు అందించిన వినతిపత్రం ఆధారంగా తుమ్మనపల్లికి వచ్చిన ప్రణవ్ బాబు స్థానిక పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
అనంతరం, ఆలస్యం లేకుండా స్మశాన వాటిక నిర్మాణానికి స్వంత ఖర్చుతో పనులకు శ్రీకారం చుట్టారు.ప్రణవ్ బాబు తీసుకున్న ఈ నిర్ణయానికి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు అని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రణవ్ బాబు మాట ఇచ్చి వెంటనే పనులు ప్రారంభించడం చూసి గ్రామస్తులుఇలాంటి నాయకుడు మాకు ఇప్పటివరకు కనిపించలేదు అంటూ వారు ప్రశంసలు కురిపించారు. గ్రామ అభివృద్ధికి ప్రణవ్ బాబు చేసిన ఈ కృషి స్థానికంగా మంచి ఆదరణ పొందుతోంది. ప్రజల మద్దతుతో ముందుకెళ్తున్న యువనేతగా ప్రణవ్ బాబు మరోసారి నిరూపించుకున్నారని ఆ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.