3 July, 2026 | 9:59 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి

27-03-2025 11:44 PM

ఈనెల 31లోపు ఆస్తి పన్ను చెల్లిస్తే వడ్డీపై 90 శాతం రాయితీ..

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి...

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ కల్పించిన వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్)ను సద్వినియోగం చేసుకోవాలని, గడువు మరో నాలుగు రోజులే ఉందని కమిషనర్ ఇలంబర్తి సూచించారు. ఈనెల 31 లోపు ఆస్తి పన్ను చెల్లించి వడ్డీపై 90 శాతం రాయితీ పొందొచ్చని గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్, సిటిజన్ సర్వీస్ సెంటర్లు, ఈ సేవా కేంద్రాల ద్వారా ఆస్తి పన్ను చెల్లించవచ్చని పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ సర్కిల్, హెడ్ ఆఫీస్‌లో ఉన్నటువంటి సిటజన్ సర్వీస్ సెంటర్లు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పని చేస్తాయని ఆయన తెలిపారు. ఇళ్లలోకి వచ్చే బిల్ కలెక్టర్లకు కూడా నేరుగా ఆస్తి పన్ను చెల్లించి రాయితీతో కూడిన రశీదులను పొందొచ్చన్నారు. మైజీహెచ్‌ఎంసీ, ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా కూడా ఆస్తి పన్ను చెల్లించే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. పన్ను చెల్లించినవారు నగరాభివృద్ధికి దోహదపడిన వారవుతారన్నారు.