04-06-2025 04:34:22 PM
ఎమ్మార్వో మహిపాల్..
తరిగొప్పుల (విజయక్రాంతి): భూ భారతి రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్వో మహిపాల్(MRO Mahipal) అన్నారు. బుధవారం మండల పరిధిలోని అబ్దుల్ నాగారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ఎమ్మార్వో మహిపాల్ మాట్లాడుతూ.. భూభారతి చట్టంలో ప్రభుత్వం అనేక వెసలుబాటు కల్పించిందన్నారు. భూమి సమస్యలు ఆర్డిఓ, తాసిల్దార్ సమక్షంలోనే పరిష్కారం అవుతాయని తెలిపారు. దరఖాస్తు రూపంలో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. కచ్చితంగా ప్రతి ఒక్కరు రిసిప్ట్ తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ఆంధ్రయ, రామారావు, శ్రీధర్, హరికృష్ణ, శ్రీనివాస్, జ్యోతి, మంజుల, వాణి, తదితరులు పాల్గొన్నారు.