13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

20-01-2026 12:04 AM

అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని

ఎర్రుపాలెం జనవరి 19 ( విజయ క్రాంతి): యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ పౌండేషన్ ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటలకు దెందుకూరు శ్రీరస్తు కళ్యాణ మండపంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని, నిర్వాహకులు సినీ నటుడు కృష్ణంరాజు కుమార్తె ప్రసీద తెలిపారు. ఈరోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ యువనేత మల్లు సూర్య విక్రమాదిత్య తో కలిపి వారు విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలోనే ప్రముఖ షుగర్ సర్జన్ డాక్టర్ ఖ్యాతిగాంచిన డాక్టర్ వేణు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరానికి అపోలో ఆస్పత్రికి చెందిన 10 మంది డాక్టర్లు, ఖమ్మం నుండి మరో 20 మంది డాక్టర్లు హాజరు కానున్నారని వారు తెలిపారు. షుగర్ వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన  ఉచితంగా ఆపరేషన్ చేయటం జరుగుతుందని వారు తెలిపారు.