16 March, 2026 | 11:53 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

20-01-2026 12:04 AM

అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని

ఎర్రుపాలెం జనవరి 19 ( విజయ క్రాంతి): యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ పౌండేషన్ ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటలకు దెందుకూరు శ్రీరస్తు కళ్యాణ మండపంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని, నిర్వాహకులు సినీ నటుడు కృష్ణంరాజు కుమార్తె ప్రసీద తెలిపారు. ఈరోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ యువనేత మల్లు సూర్య విక్రమాదిత్య తో కలిపి వారు విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలోనే ప్రముఖ షుగర్ సర్జన్ డాక్టర్ ఖ్యాతిగాంచిన డాక్టర్ వేణు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరానికి అపోలో ఆస్పత్రికి చెందిన 10 మంది డాక్టర్లు, ఖమ్మం నుండి మరో 20 మంది డాక్టర్లు హాజరు కానున్నారని వారు తెలిపారు. షుగర్ వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన  ఉచితంగా ఆపరేషన్ చేయటం జరుగుతుందని వారు తెలిపారు.