16-06-2025 02:28:43 AM
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు
ముషీరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): 2005 నుంచి సమాచార హక్కు చట్టం అందుబాటులోకి వచ్చిందని, తద్వా రా ప్రభుత్వ సమాచారాన్ని పొందే హక్కును కల్పిస్తుందన్నదని. ఈ ఆర్టీఐ యాక్ట్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మాజీ సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యు లు అన్నారు.
ఈ మేరకు ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్ హల్లో హైదరాబాద్ సిటిజన్ ఫోరం, పీపుల్స్ ఫ్రెండ్ ఫర్ రైట్టు ఇన్ఫర్మేషన్ ఆధ్వర్యంలో ‘ఆర్టీటి చట్టం అమలు తీరు- పొంచి ఉన్న ప్రమాదాలు‘ అనే అంశంపై చర్చ గోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ కేంద్ర సమాచార కమిషనర్, ప్రొఫెసర్ మాడ భూషి శ్రీధర్ ఆచార్యులు మాట్లాడుతూ పది రూపాయల అప్లికేషన్ ద్వారా విలువైన సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా పొందవచ్చు అని తెలిపారు.
ఈ చట్టానికి సంబంధించి ఎలాంటి ప్రశ్న అడగాలో అందుకు సంబంధించిన రీసెర్చ్ చేసి స్పష్టమైన అవగాహన కల్గి ఉండాలన్నారు. అదే విధంగా సరైన సమాచారం దొరికేంత వరకు ప్రయత్నం చేస్తూ ఉండాలన్నారు. అందుకు అనుగుణంగా అప్పిలు చేస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఐ నిపుణులు శ్రీనివాస్ మాధవ్, ఏఐఎల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. పార్థసారథి, ఆర్టీఐ యాక్టివిస్టు ఎం శ్రీనివాస్, హైదరాబాద్ సిటిజన్ ఫోరం శ్రీనివాస రావు ఎం. శ్రీనివాసరావు, కే.వీరయ్య పాల్గొన్నారు.