calender_icon.png 16 June, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదాయం ఫుల్.. సౌకర్యాలు నిల్ రోడ్లపై సంతలు

16-06-2025 02:29:47 AM

మహబూబాబాద్, జూన్ 15 (విజయ క్రాంతి): రోడ్లపై వారాంతపు సంతలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఆదాయం దండిగా వస్తున్నప్పటికీ, సంతలకు ప్రత్యేకం గా స్థలం కేటాయించకుండా రోడ్లపైనే నిర్వహిస్తుండడం వల్ల చిరు వ్యాపారులకు, విని యోగదారులకు, వాహనదారులకు తీవ్ర ఇ బ్బందులు కలిగిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ పట్టణాలు, మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న వారాంతపు సంతలు దాదాపుగా అన్ని రహదారుల పైనే నిర్వహిస్తున్నారు.

ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మరిపెడ, కుర వి, నరసింహుల పేట, కేసముద్రం, గూడూ  రు, ఇనుగుర్తి, నెల్లికుదురులో వారాంతపు సంతలు రోడ్లపైనే  నిర్వహిస్తుండగా, రహదారులపై సంతలు నిర్వహించే రోజు వాహ నాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. రోడ్లపై సంతలు నిర్వహించే రోజు ల్లో ప్రజలు, దుకాణాలతో రోడ్లు మూసుకుపోతున్నాయి. ఫలితంగా ఆ సమయంలో అత్యవసర సేవలందించే 108 అంబులెన్స్, అగ్నిమాపక యంత్రం వెళ్లడానికి కూడా ఆ టంకంగా సంతలు మారుతున్నాయి.

సంత లు నిర్వహించే రోడ్లపై అనేక పర్యాయాలు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ప్రతి ఏటా సంతల నిర్వహణ కోసం ఆయా ము న్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు టెండర్లు పిలుస్తుండగా, లక్షల రూపాయలు ఆదాయం లభిస్తుంది. అయితే సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యా ప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సంత ల్లో కనీస వసతులు లేకపోవడం గమనార్హం. అంగడి నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన టెండర్ దారులు అంగట్లో దుకాణాలు ఏ ర్పాటు చేసుకునే చిరు వ్యాపారుల నుంచి తైబజార్, పశువుల అమ్మకాలకు రహదారి రహదారి చిట్టి పేరుతో 50 నుంచి 200 వరకు ఒక్కొక్కరి నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు.

అయితే సౌకర్యాల విషయంలో అటు టెండర్ దారులు, ఇటు పం చాయతీ, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని చిరు వ్యాపారులు ఆరోపిస్తు న్నారు. సౌకర్యాల గురించి తైబజార్ నిర్వాహకులను అడిగితే మీకు ఇష్టం ఉంటే ఇక్క డికి రండి లేదంటే వెళ్లిపోండి, మేం అడిగినంత ఇవ్వాల్సిందే అంటూ దబాయిస్తున్నా రని చిరు వ్యాపారులు వాపోతున్నారు. పొట్టకూటి కోసం కష్టమైనా నిస్టురమైన అంగడ్లు తిరగాల్సిన పరిస్థితి నెలకొందని వా పోతున్నారు. పలుచోట్ల అంగడి నిర్వహించే ప్రదేశంలో లైట్లు ఏర్పాటు చేయకపోవడం తో రాత్రి వరకు అంగడి నిర్వహించే పరిస్థితి లేకుండా పోతుందని వాపోతున్నారు.

ఇబ్బందులు లేకుండాసంతలు నిర్వహించాలి

సంతల నిర్వహణ రోడ్లపై కాకుండా ఆ యా కేంద్రాల్లో ప్రత్యేకంగా స్థలం కేటాయించాలి. పశువులకు, ఇతర వ్యాపారాలకు వేరువేరుగా స్థలం కేటాయించాలి. సంత నిర్వహించే ప్రదేశంలో తాగునీటి వసతి, టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలి. ప్రత్యేకంగా చిరు వ్యాపారుల కోసం ప్లాట్ఫారాలు ఏర్పాటు చేసి పైన కప్పు వేస్తే వర్షా కాలంలో సంతల నిర్వహణకు ఇబ్బంది తొలగిపోతుంది. 

వచ్చే ఆదాయంలో సగంచెల్లింపుకే!

 కుటుంబాన్ని పోషించుకోవడానికి సంతల్లో చిరు వ్యాపారాలు చేస్తున్నాం. ప్రతి రోజు జిల్లాలో ఎక్కడో చోట జరిగే సంతకు సరుకులను తీసుకువెళ్లడం, విక్రయించగా వచ్చిన ఆదాయంలో కొంత నిర్వహణ ఖర్చు, కుటుంబ పోషణకు వినియోగిస్తున్నాం. అయితే కొన్ని చోట్ల ఎక్కువగా రుసుం వసూలు చేస్తున్నారు. దీనితో వచ్చే ఆదాయంలో సగం రుసుం చెల్లించడానికి సరిపోతుంది. పొద్దంతా కష్టపడి సంపాదిస్తే, వాహనంలో పెట్రోలు, ఇతర ఖర్చులకు తగ్గట్టుగా రాబడి లేదు. ఇందులో వంద నుంచి రెండు వందల రూపాయలు రుసుం చెల్లించాల్సి వస్తుండడంతో ఆదాయానికి మించిన ఖర్చు భారంగా మారింది. అన్ని అంగళ్లలో ఒకే విధంగా తైబజార్ చార్జీలు ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. చిరు వ్యాపారులకు చేయూతగా నిలవాలి. 

రఫీ, చిరు వ్యాపారి