26 April, 2026 | 7:46 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

06-02-2025 07:57 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల కాలేజీ రోడ్ గ్రౌండ్ లో రాంనగర్ ఏరియాకి చెందిన బండం బాపు(52) గురువారం ఉదయం షటిల్ ఆడుతూ గుండెపోటుకు గురై మృతి చెందినట్లు మంచిర్యాల పట్టణ ఎస్ఐ ముత్తే ప్రవీణ్ తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... చెన్నూరుకు చెందిన సతీష్ వద్ద రూ. 20 లక్షలు అప్పుగా తీసుకోగా ఆ విషయంలో ఏర్పడిన ఆర్థిక వ్యవహారాల్లో బాపుని పలుమార్లు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో తీవ్ర మనోవేదన గురయ్యే వారని, ఈ విషయమే పదేపదే తలుచుకుంటూ ప్రతిభ కాలేజీ గ్రౌండ్ లో షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడని, అక్కడున్న వారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యం పొందుతూ మృతి చెందారు. ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాపు భార్య సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.