calender_icon.png 15 June, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

11-06-2025 10:22:55 PM

18 కేజీలు స్వాధీనం..

ఒకరు అరెస్టు..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయపల్లి గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకుని, ఒకరిని అరెస్టు చేశారు. తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్(SI Kiran Kumar) కథనం ప్రకారం.. మహారాష్ట్ర గోండు పిప్పిరి నుండి నకిలీ పత్తి విత్తనాలను తీసుకోవస్తుండగా బోయపల్లె గ్రామ సమీపంలో మాసాడి రవీందర్ పట్టుబడ్డారు. అతని దగ్గర 18 కేజీల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. పట్టుబడిన పత్తి విత్తనాల విలువ రూ.54 వేల వరకు ఉంటుందని, నిందితున్ని అరెస్టు చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు.

ఈ విత్తనాలను తన వ్యవసాయ భూమిలో వేసేందుకు తీసుకురావడం జరిగిందని నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకోవడం జరిగిందని ఆయన తెలిపారు .ప్రభుత్వ నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో అమ్మ రాదని, అలాగే వీటిని రైతులు కూడా కొనుగోలు చేసుకోవద్దని ఎక్కడైనా అమ్ముతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్సై తెలిపారు. తాండూర్ మండల వ్యవసాయ అధికారిని సుష్మ పర్యవేక్షణలో పంచనమా నిర్వహించడం జరిగిందని ఎస్సై తెలిపారు.