2 June, 2026 | 6:27 PM

Breaking News

విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో విశేష సేవలు అందించిన లైన్‌మ్యాన్ దేవ్ సింగ్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు   •   మండల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •   గుంజపడుగు గ్రామంలో వ్యర్థాలపై ప్రజలకు సర్పంచ్ అవగాహన   •   ఘనంగా అవతరణ వేడుక   •   పలు గ్రామాల్లో పీసీసీ కేంద్రాలను సందర్శించిన డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు   •   పట్టపగలే యదేచ్చగా మొరం తవ్వకాలు.. చోద్యం చూస్తున్న అధికారులు   •   అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు   •   కాగజ్‌నగర్ సభలో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ అంశంపై బీఆర్ఎస్ ఆరోపణలు   •   పరిపాలన చేతకాక సీఎం బూతు మాటలు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే తలసాని   •   రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉద్యమకారులు, పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం   •  

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ సోనియా గాంధీ కృషి వల్లనే రాష్ట్రం ఏర్పాటు.

02-06-2026 05:21 PM

బోథ్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోని అమ్మ పాత్ర ఎంతగానో ఉందని ఆమె కృషి వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమనం అయిందని బోత్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి ఎంతగానో ఉందన్నారు.

ఇంకా ప్రభుత్వం గొప్పలకు పోయి అప్పులు చేసిందని విమర్శించారు ఇందిరమ్మ ఇల్లు సన్న బియ్యం పంపిణీ పంట కొనుగోలు కార్యక్రమాలను రైతులకు పేదల కోసం చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి మల్లేష్ వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి డైరెక్టర్లు యూనస్ భోజన మునేశ్వర్ మాత్రం నగేష్ నారాయణ విజయ్ నందకుమార్ పొన్నాల సెమిందర్ రెడ్డి శేఖర్ పలు రైతులు పాల్గొన్నారు.