27 April, 2026 | 11:48 AM

Breaking News

న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం   •   హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి   •   హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. ​ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులు   •   నార్కెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ మృతి   •   ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: భట్టి విక్రమార్క   •   బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం!   •   శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు   •   దమ్మాయిగూడెం వద్ద రెండు లారీలు ఢీ   •   నిరుపేద చిన్నారి ప్రాణాల కోసం పోరాటం – దాతల సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి   •   బంకులు బంద్.. ప్రజలు పరేషాన్   •  

ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్ఐసీకి అప్పగింత

22-10-2024 12:07 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ధరణి పోర్టల్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం ఎన్ఐసీకి అప్పగించింది. మూడేళ్ల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఐసీ పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగిస్తామని ఒప్పందలో వెల్లడించింది. ధరణి పోర్టల్ నిర్వహణను ప్రైవేట్ సంస్థ టెరాసిస్ నుంచి ఎన్ఐసీకి బదలాయించింది. సాంకేతిక అంశాల్లో ఎన్ఐసీకి సహకరించాలని టెరాసిస్ ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ధరణిలో ఉన్న లోతుపట్లను తెలపాలని, ఎన్ఐసీకి సహకరించేందుకు వచ్చే నెలాఖరు వరకు టెరాసిస్ కు గడువు ఇచ్చింది.