10 April, 2026 | 3:58 PM

Breaking News

అభివృద్ధి పథంలో భాగ్యనగర్ తండ గ్రామపంచాయతీ   •   టూ వీలర్ తో మెకానిక్ చేస్తూ... ఉపాధి   •   అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •  

అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట

13-12-2024 06:25 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): పుష్ప-2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనతో రిమాండ్‌లో ఉన్న ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై  హైకోర్టు విచారంచింది. అల్లు అర్జున్ న్యాయవాద బృందం చేసిన వాదనలను అంగీకరించిన కోర్టు అతనికి షరతులతో కూడిన నాలుగు వారాల పాటు బెయిల్ ఇచ్చింది. చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ కు సొంత పూచీకత్తును సమర్పించాలని అల్లు అర్జున్ ను హైకోర్టు ఆదేశించారు. 

అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిన ఘటన ఒక మహిళ మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. నటుడి న్యాయవాద బృందం బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అతనికి నేరుగా విషాదంతో ముడిపడి ఉండటానికి తగిన సాక్ష్యాలు లేవని వాదించారు.  రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. అర్నబ్ గోస్వామి కేసులో బాంబే కోర్టు తీర్పు ఆధారంగా హైకోర్టు అల్లు అర్జున్ కేసులో ఉత్తర్వులు జారీ చేసింది. అల్లు అర్జున్ దాఖాలు చేసిన క్వాష్ పిటిషన్ లో మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం చెప్పారు.