17 April, 2026 | 3:45 PM

Breaking News

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •  

తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు..

10-04-2025 12:08 AM

ప్రభుత్వానికి సోయి లేదు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదని మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ చెప్పిన మాటలే నిజం అవుతున్నాయని, తెలంగాణ నీళ్లపై హక్కులు కోల్పోతున్నామని అన్నారు.

చంద్రబాబు చేతిలోకి నాగార్జనసాగర్ వెళ్లిందని, బాబు అంటే రేవంత్‌రెడ్డి సర్కార్‌కు భయం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. సాగర్‌లోకి విశాఖ సీఆ ర్‌పీఎఫ్ బెటాలియన్ రావడం విచాకరమని, సాగర్‌ను తెలంగాణ నుంచి ఆంధ్రాకు అప్పగించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు.

సీఎం, మంత్రులు దోచుకుందాం దాచుకుందాం చందంగా మారారని విమర్శించారు. తెలంగాణలో పరోక్షంగా బాబు పాలనే నడుస్తోం దని ఆరోపించారు. సాగర్‌పై 2023కి ముందున్న స్థితిని కొనసాగించాలన్నారు.