1 July, 2026 | 6:52 PM

Breaking News

ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •  

గ్రామ సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

01-07-2026 05:46 PM

2 వార్డ్ మెంబర్ శ్రీకాంత్ నాయుడు

తుంగతుర్తి(విజయక్రాంతి): గ్రామ వీధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే కాంగ్రెస్ పార్టీ ద్యేయమని రెండో వార్డ్ మెంబర్ ఎల్లబోయిన శ్రీకాంత్ నాయుడు అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు ప్రక్కన, రెండవ వార్డులో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు పక్కన మురికి కాలువ లేకపోవడంతో చిన్న వానబడితే సైతం, రోడ్డు మొత్తం నీరు నిలబడి, దుర్గంధంతో దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

గత కొద్ది రోజులుగా కాలువ మరమ్మత్తు చేయాలని గ్రామపంచాయతీ సర్పంచ్, అధికారులకు చెబుతున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు. దీనితో బుధవారం మధ్యాహ్నం గడ్డపారతో తోముతూ, పారతో మట్టిని తీసు కాలువ మురికి నీళ్లు బయటకు వెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంకూరు సుదర్శన్, యాకన్న, రమేష్ కృషి చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి దవాఖాన పక్క సందులో నూతనంగా కాల్వ ఏర్పాటుకు నిధులు తక్షణమే మంజూరు చేయాలని వీధివాసులు కాంగ్రెస్ నాయకులు, కోరుతున్నారు.