17 July, 2026 | 1:51 PM

Breaking News

పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •  

హౌస్ అరెస్టులు ఎందుకు చేశారో చెప్పండి?

16-07-2025 12:00 AM

బీఆర్‌ఎస్ నేత గాదరి కిషోర్ 

హైదరాబాద్, జులై 15 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి మొనగాడు అయితే మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్టులు చేశారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహిం చిన మీడియా సమావేశంలో గాదరి కిషోర్ మాట్లాడుతూ.. రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సొంత ఊర్లో రైతు రుణమాఫీ అయిందో లేదో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

సోడా కలిపినంత ఈజీ కాదు గోదావరి నీళ్లు ఇచ్చుడు అని సీఎం అంటున్నారు.. కానీ బీఆర్‌ఎస్ హయాంలో తాము తుంగతుర్తికి గోదావరి నీళ్లు ఇచ్చామన్నారు. జగదీశ్ రెడ్డికి గంజి ఉందో బెంజ్ ఉందో నాగారం వచ్చి చూడాలనిఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు ‘జై తెలంగాణ’ అని రేవంత్ ఒక్కసారి కూడా అనలేదని దుయ్యబట్టారు.