సింధు శుభారంభం
మాళవిక, శ్రీకాంత్ ఔట్
ఇండోనేషియా ఓపెన్
జకార్తా, జూన్ 2: ఇండోనేషియా ఓపెన్ సూపర్ -1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భార త స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 25 21- బుసానన్(థాయ్లాండ్)పై విజయం సాధించింది. 51 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో సింధు తన ప్రత్యర్థిపై ఆ ధిపత్యం కనబరిచింది.
తొలి గేమ్ హోరాహోరీగా సాగినప్పటికీ, రెండో గేమ్లో మా త్రం సింధు తనలోని ఆటను బయటికి తీసి విజయాన్ని అందుకుంది. అయితే రెండో రౌండ్లో హైదరాబాదీ ప్లేయర్కు అసలైన పరీక్ష ఎదురుకానుంది. ప్రపంచ నంబర్ వన్ యాన్ సే యంగ్ను సింధు ఎదుర్కోనుంది. గతవారం సింగపూర్ ఓపెన్లో యా న్ సే చేతిలో రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. అలాగే మరో ప్లేయర్ మాళవిక బన్సోద్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. మాళవిక బన్సోద్ 12-10 స్కోరుతో ఏడో సీడ్ చోచువాంగ్ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు.






